చైనా రైల్వే స్టేషన్‌లో కత్తులతో స్వైర విహారం | 27 killed, 109 hurt in knife attacks in China | Sakshi
Sakshi News home page

చైనా రైల్వే స్టేషన్‌లో కత్తులతో స్వైర విహారం

Mar 2 2014 2:12 AM | Updated on Sep 2 2017 4:14 AM

చైనా, యునాన్ ప్రావిన్స్ రాజధాని కున్మింగ్ రైల్వే స్టేషన్‌లో శనివారం కత్తులతో దాడులకు పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తుల బృందం 27 మందిని హతమార్చింది.

దుండగుల దాడుల్లో 27 మంది మృతి, 109 మందికి గాయాలు
ఉగ్రవాద దాడిగా అనుమానాలు
 
 బీజింగ్: చైనా, యునాన్ ప్రావిన్స్ రాజధాని కున్మింగ్  రైల్వే స్టేషన్‌లో శనివారం కత్తులతో దాడులకు పాల్పడిన  గుర్తుతెలియని వ్యక్తుల బృందం 27 మందిని హతమార్చింది. ఈ దాడిలో మరో 109 మంది  గాయపడ్డారని ‘జిన్హువా’ వార్తాసంస్థ వెల్లడించింది. నలుపు రంగు దుస్తులు ధరించి రెండ్రెండు కత్తులు పట్టుకున్న బృందం ప్రజలను తరుముతూ విచ క్షణారహితంగా దాడిచేశారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. వచ్చే వారం చైనీస్ పార్లమెంటు సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ ఉగ్ర చర్య చోటుచేసుకుందని అధికారులు భావిస్తున్నారు.

 

దాడిచేసిన వారు జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో అల్ కాయిదాతో సంబంధాలు నెరుపుతూ ముస్లిం ఉయూర్‌లలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న ‘ఈస్ట్ తుర్కిస్థాన్ ఇస్లామిక్ మూమెంట్(ఈటీఐఎం)’ ఉగ్రవాద సంస్థకు చెందినవారు కూడా కావచ్చని అనుమానిస్తున్నారు. కొన్నేళ్లుగా అస్థిరతతో ఉన్న ఈ ప్రావిన్స్‌లో గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి. గతేడాది బీజింగ్‌లోని తియాన్మెన్ స్క్వేర్ వద్ద పర్యాటకుల గుంపులోకి ఓ కారుతో దూసుకెళ్లిన ఈటీఐఎం సభ్యులు ముగ్గురు పౌరులను హతమార్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement