లోయలో పడ్డ వాహనం: 16 మంది మృతి | 16 dead in Uttarakhand accident | Sakshi
Sakshi News home page

లోయలో పడ్డ వాహనం: 16 మంది మృతి

Nov 20 2013 12:26 PM | Updated on Sep 2 2017 12:48 AM

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్గఢ్ సమీపంలోని దొబట్ వద్ద బుధవారం ఉదయం బొలెరో వాహనం అదుపు తప్పి ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఆ ఘటనలో 16 మంది ప్రయాణికులు అక్కికక్కడే మరణించారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్గఢ్ సమీపంలోని దొబట్ వద్ద బుధవారం ఉదయం బొలెరో వాహనం అదుపు తప్పి ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఆ ఘటనలో 16 మంది ప్రయాణికులు అక్కికక్కడే మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి ఆరుగురుని రక్షించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

 

దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. మొత్తం 22 మందితో వెళ్తున్న బొలెరో వాహనం పితోర్గఢ్ సమీపంలోని దర్చులా - దొబట్ రహదారిపై వెళ్తు అదుపు తప్పి లోయలో పడిందని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement