ఒడిశా బొగ్గుగనిలో ప్రమాదం: పది మంది మృతి | 10 killed in coal mine mishap in Odisha's Sundargarh district | Sakshi
Sakshi News home page

ఒడిశా బొగ్గుగనిలో ప్రమాదం: పది మంది మృతి

Aug 11 2013 3:54 AM | Updated on Sep 1 2017 9:46 PM

ఒడిశాలోని సుందరగఢ్ జిల్లాలో శనివారం ఓ బొగ్గుగనిలో ఎత్తయిన బొగ్గు కుప్ప ఉన్నట్టుండి కూలిపోవడంతో పది మంది మృతిచెందగా ఐదుగురు గాయపడ్డారు.

 భువనేశ్వర్/రూర్కెలా: ఒడిశాలోని సుందరగఢ్ జిల్లాలో శనివారం ఓ బొగ్గుగనిలో ఎత్తయిన బొగ్గు కుప్ప ఉన్నట్టుండి కూలిపోవడంతో పది మంది మృతిచెందగా ఐదుగురు గాయపడ్డారు. కుల్దాలోని మహానది కోల్‌ఫీల్డ్స్ కంపెనీ(ఎంసీఎల్)కి చెందిన వసుంధర-గర్జన్‌బహాల్ ఓపెన్ క్యాస్ట్ గనిలో పరిసర గ్రామాల ప్రజలు బొగ్గు ఏరుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. బొ గ్గు కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.  వర్షాల వల్ల బొగ్గు కుప్ప కూలిపోయి ఉంటుందని అధికారులు చెప్పారు. మృతుల కుటుంబాలకు ఎంసీఎల్, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ప్రకటించాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement