తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆత్మహత్యలు పెరిగాయని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
కొత్తగూడెం: తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆత్మహత్యలు పెరిగాయని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో రైతు దీక్ష చేపడుతున్నామని తెలిపారు.
ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సింగరేణి కార్మికులకు విధిస్తున్న ఆదాయపన్నును రద్దు చేయాలని, ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తుతానని హామీయిచ్చారు.