గోదావరిలో యువకుడు గల్లంతు | Youth missing in Godavari River at Attamadugu | Sakshi
Sakshi News home page

గోదావరిలో యువకుడు గల్లంతు

Jul 18 2015 4:11 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం కలమడుగు వద్ద గోదావరిలో పుష్కర స్నానం చేస్తూ ఒక యువకుడు గల్లంతయ్యాడు.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం కలమడుగు వద్ద గోదావరిలో పుష్కర స్నానం చేస్తూ ఒక యువకుడు గల్లంతయ్యాడు. శనివారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కరీంనగర్ జిల్లా మల్యాలకు చెందిన కార్తీక్ కుటుంబసభ్యులతో కలసి కలమడుగు సమీపంలోని అత్తమడుగు అనే ప్రాంతంలో గోదావరిలోకి దిగారు. స్నానం చేసిన అనంతరం కార్తీక్, బంధువు శ్రవణ్‌తో కలసి బయటకు వస్తుండగా కాలు జారి లోతు ఎక్కువ ఉన్న చోట నీటిలో పడిపోయారు. చుట్టుపక్కల వారు శ్రవణ్‌ను కాపాడగలిగారు. కార్తీక్ జాడ మాత్రం తెలియలేదు. ఈతగాళ్లు అతని కోసం గాలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement