యువరైతు ఆత్మహత్య | Young farmer commits suicide | Sakshi
Sakshi News home page

యువరైతు ఆత్మహత్య

Sep 11 2015 7:07 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పులబాధతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మలహర్రావు మండలం కొయ్యూరు గ్రామంలో జరిగింది.

కాటారం (కరీంనగర్) : అప్పులబాధతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మలహర్రావు మండలం కొయ్యూరు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన వంశీకృష్ణ(30) తనకున్న రెండున్నర ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో గత రెండు సంవత్సరాలుగా పంటలు సరిగా పండక అప్పులు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపం చెంది శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement