అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది.
ఖమ్మం : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. ఈ సంఘటన బుధవారం ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలో జరిగింది. వివరాలు..నారాయణపురం గ్రామానికి చెందిన నల్లపు శైలజ(25) అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని మృతి చెందింది. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(అశ్వారావుపేట)