అప్పుల బాధ తాళలేక ఓ మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
మహిళా రైతు ఆత్మహత్య
Jul 8 2017 11:44 AM | Updated on Sep 5 2017 3:34 PM
ములుగు: అప్పుల బాధ తాళలేక ఓ మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం మల్లంపల్లిలో శనివారం వెలుగుచూసింది.
గ్రామానికి చెందిన మెరుగు అచాల ఈ రోజు ఉదయం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. భర్త మూడేళ్ల క్రితమే మృతిచెందడంతో కుటుంబ పోషణ ఈమెపై పడింది. ఈ క్రమంలో అప్పుల బాధ పెరిగిపోవడంతో ఆత్మహత్య చేసుకుంది.
Advertisement
Advertisement