వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఓ మహిళ మృతిచెందింది.
బూర్గంపాడు: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురం వద్ద శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన మర్రికుంట నాగమ్మ(38) రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో భద్రాచలం నుంచి పాల్వంచ వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. లారీ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదే చేసి దర్యాప్తు చేపట్టారు.