'గాంధీ'లో స్వైన్‌ఫ్లూతో మహిళ మృతి | Woman dies of swine flu | Sakshi
Sakshi News home page

'గాంధీ'లో స్వైన్‌ఫ్లూతో మహిళ మృతి

Dec 3 2015 8:26 PM | Updated on Sep 3 2017 1:26 PM

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మరో స్వైన్‌ఫ్లూ మృతి నమోదైంది.

హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మరో స్వైన్‌ఫ్లూ మృతి నమోదైంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ వేంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన సూర్యకుమారి (55) తీవ్రమైన జ్వరంతో సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చేరింది. నిర్ధారణ పరీక్షల్లో స్వైన్‌ఫ్లూ పాజిటివ్ రావడంతో మెరుగైన చికిత్స కోసం గత నెల 29వ తేదీన గాంధీ ఆస్పత్రిలో రిఫరల్‌పై చేరింది. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం సూర్యకుమారి మృతి చెందింది. ప్రస్తుతం స్వైన్‌ఫ్లూ వార్డులో ముగ్గురు, డిజాస్టర్ వార్డులో ఐదుగురు స్వైన్‌ఫ్లూ అనుమానితులకు వైద్యం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement