రోడ్డు ప్రమాదంలో యువతి మృతి | Woman dies in Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

Jul 28 2015 3:06 PM | Updated on Aug 30 2018 3:56 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్న ప్రమాదంలో యువతి మృతి చెందింది.

రంగారెడ్డి : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్న ప్రమాదంలో యువతి మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి స్టేజీ సమీపంలో మంగళవారం జరిగింది. బైక్ పై వెళ్తున్న యువతి(23), యువకులను(25) ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతికి తీవ్రగాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. మృతురాలిది రాంజేంద్రనగర్‌గా భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement