అనారోగ్య కారణాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం సూరజ్పూర్లో బుధవారం ఉదయం జరిగింది.
ఆదిలాబాద్: అనారోగ్య కారణాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం సూరజ్పూర్లో బుధవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన ఓలెపు అంకమ్మ(35) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఎంత వైద్యం చేయించినా లాభం లేకపోవడంతో విసుగుచెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.