కాంగ్రెస్‌ నేతలతో భేటీని స్వాగతిస్తున్నాం | we welcome the kcr meeting with congress leaders | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేతలతో భేటీని స్వాగతిస్తున్నాం

Mar 30 2017 5:27 PM | Updated on Aug 15 2018 8:57 PM

కాంగ్రెస్‌ నేతలతో భేటీని స్వాగతిస్తున్నాం - Sakshi

కాంగ్రెస్‌ నేతలతో భేటీని స్వాగతిస్తున్నాం

మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సీఎం భేటీని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌సిటీ: మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సీఎం భేటీని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..ఉగాది నుంచి సీఎంలో వచ్చిన మార్పు ఎన్ని రోజులుంటుందో కానీ అది మంచిదేనన్నారు. ధర్నా చౌక్‌లను షిప్ట్ చేస్తేనో గొంతు నొక్కితోనో పనులు కావని తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లా సమస్యలతోపాటు ఇతర జిల్లాల ప్రతిపక్ష నేతలతో సీఎం సమావేశం కావాలని కోరారు. పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. ఫీజుల నియంత్రణ కమిటీ ఏం చెప్పిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యావ్యవస్థలో కార్పోరేట్ ఆధిపత్యం ఉందని, సీఎం జోక్యం చేసుకుని విద్యా దోపిడీని అరికట్టాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement