గోల్కొండలో జాతీయజెండా ఎగరేస్తాం: కిషన్రెడ్డి | we stood by our own strength, says kishanreddy | Sakshi
Sakshi News home page

గోల్కొండలో జాతీయజెండా ఎగరేస్తాం: కిషన్రెడ్డి

Sep 16 2014 1:11 PM | Updated on Mar 29 2019 9:24 PM

మెదక్ లోక్సభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తమ బలాన్ని తాము నిలబెట్టుకున్నామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు.

మెదక్ లోక్సభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తమ బలాన్ని తాము నిలబెట్టుకున్నామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం ఆయన ఆ అంశంపై స్పందించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడ్డారు.

''సాయుధ పోరాటంలో పాల్గొన్నవారికి పెన్షన్లు ఆపేస్తారా? మా నిజాం రాజు తరతరాల బూజు అన్న దాశరథి మాటలను కేసీఆర్ ఖండిస్తారా? సెప్టెంబర్ 17ను ఎందుకు గుర్తించడంలేదు?'' అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎంఐఎం ఒత్తిడితో చరిత్రను కాలగర్భంలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. తాము రేపు గోల్కొండలో జాతీయ జెండా ఎగరేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement