కశ్మీర్‌లో అంగుళం జాగాను కూడా వదులుకోం | We cant left even single Inch space | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో అంగుళం జాగాను కూడా వదులుకోం

Sep 4 2016 2:58 AM | Updated on Mar 29 2019 9:31 PM

కశ్మీర్‌లో అంగుళం జాగాను కూడా వదులుకోం - Sakshi

కశ్మీర్‌లో అంగుళం జాగాను కూడా వదులుకోం

కశ్మీర్‌లో అంగుళం జాగాను కూడా వదులుకునేందుకు భారత్ సిద్ధంగా లేదని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ అన్నారు.

కేంద్ర మంత్రి గంగారాం అహిర్
 
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కశ్మీర్‌లో అంగుళం జాగాను కూడా వదులుకునేందుకు భారత్ సిద్ధంగా లేదని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జెడ్పీ మైదానంలో జరిగిన తిరంగాయాత్రసభలో ఆయన ప్రసంగించారు. హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి  ఉగ్రవాద సంస్థలు కశ్మీర్‌లో అశాంతికి కుట్రలు చేస్తున్నాయని అన్నారు.

తెలంగాణలో నిజాం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం దౌర్భాగ్యమని అన్నా రు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బైక్ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలసి అహిర్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement