కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు: నాయిని | we are planning for godavari celebrations, says nayini | Sakshi
Sakshi News home page

కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు: నాయిని

Mar 22 2015 3:43 PM | Updated on Oct 20 2018 5:03 PM

కాళేశ్వరం వద్ద ఉన్న గోదావరి పుష్కర ఘూట్లను తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఆదివారం సందర్శించారు.

కరీంనగర్: కాళేశ్వరం వద్ద ఉన్న గోదావరి పుష్కర ఘాట్ లను తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గోదావరి పుష్కరాలకు కుంభమేళాను తలపించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. తెలంగాణలోని పోలీస్ స్టేషన్లన్నింటినీ అనుసంధానం చేస్తూ హైదరాబాద్ లో కమాండెంట్ కంట్రోల్ రూమ్ పేర్పాటు చేస్తామని నాయని తెలిపారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమౌతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఇకపై పోలీసులకు వీక్ ఆఫ్ లు కల్పిస్తామన్నారు.    
 

Advertisement
 
Advertisement
Advertisement