హిజ్రాలకు కౌన్సిలింగ్ | warangal distirict police counciling to hijars | Sakshi
Sakshi News home page

హిజ్రాలకు కౌన్సిలింగ్

Feb 6 2015 2:14 PM | Updated on Sep 2 2017 8:54 PM

హిజ్రాలకు కౌన్సిలింగ్

హిజ్రాలకు కౌన్సిలింగ్

రైళ్లలో ప్రయాణికుల పట్ల హిజ్రాల ఆగడాలు ఎక్కువ అవుతుండటంతో వరంగల్ జిల్లా రైల్వే పోలీసులు శుక్రవారం వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.

వరంగల్ అర్బన్:  రైళ్లలో ప్రయాణికుల పట్ల హిజ్రాల ఆగడాలు ఎక్కువ అవుతుండటంతో వరంగల్ జిల్లా రైల్వే పోలీసులు శుక్రవారం వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. సుమారు 100 మంది హిజ్రాలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. రైళ్లలో ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించవద్దని వారికి సూచించారు.

జుగుప్సాకరమైన కార్యక్రమాలకు పాల్పడి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దన్నారు. అలాంటి పనులకు పాల్పడితే రైల్వే చట్టప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. కౌన్సిలింగ్లో వరంగల్ జీఆర్‌పీ సీఐ రవికుమార్, ఎస్‌ఐ గోవర్ధన్, ఆర్‌పీఎఫ్ సీఐ హరిబాబు,ఎస్ అనామిక మిశ్రాలు నిర్వహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement