
భయభ్రాంతులకు గురైన స్థానికులు
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని పాతబస్టాండ్లో గురువారం రాత్రి హిజ్రాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. జగిత్యాల జిల్లాకు చెందిన హిజ్రాలు పాతబస్టాండ్ ప్రాంతంలో తిరుగుతుండగా సిద్ధిపేట జిల్లాకు చెందిన మరికొంత మంది హిజ్రాలు పాతబస్టాండ్కు చేరుకున్నారు.
దీంతో తమ అనుమతి లేకుండా తమ జిల్లాకు ఎందుకు వచ్చారంటూ రెండు వర్గాల వారు వాగ్వాదానికి దిగారు. ఇంతలో రెచ్చిపోయిన హిజ్రాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హిజ్రాలను పోలీస్స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.
నడి రోడ్డుపై ట్రాన్స్ జెండర్ల హల్చల్.. ఒకరిపై ఒకరు దాడి
జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై ట్రాన్స్ జెండర్ల మధ్య ఘర్షణ
జగిత్యాల, సిద్దిపేటలకు చెందిన రెండు వర్గాల మధ్య అడుక్కునే విషయంలో ప్రారంభమైన గొడవ
చివరకు ఒకరిపై ఒకరు దాడి.. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్… pic.twitter.com/oY1QUOGKFm— Telugu Scribe (@TeluguScribe) June 27, 2025