రేపు వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై బహిరంగ విచారణ | Vikaruddin encounter a public inquiry tomorrow | Sakshi
Sakshi News home page

రేపు వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై బహిరంగ విచారణ

May 6 2015 12:25 AM | Updated on Sep 3 2017 1:29 AM

ఆలేరు మండలం టంగుటూరు శివారు ప్రాంతంలో గత నెల 7న జరిగిన వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై బహిరంగ విచారణ నిర్వహిస్తున్నట్లు నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి మం గళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నల్లగొండ : ఆలేరు మండలం టంగుటూరు శివారు ప్రాంతంలో గత నెల 7న జరిగిన వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై బహిరంగ విచారణ నిర్వహిస్తున్నట్లు నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వరంగల్ జిల్లాకు చెందిన ఆర్‌ఎస్‌ఐ ఉదయ్ భాస్కర్ ఆలేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు.. ఘటన జరిగిన రోజు న ఆర్‌ఎస్‌ఐ ఉదయ్‌భాస్కర్ నేతృత్వంలో 16 మంది ఇతర పోలీసులతో కలిసి వరంగల్ సెంట్రల్ జైల్ నుంచి ఉదయం 7.55 గంటలకు 5 గురు రిమాండ్ ముద్దాయిలను నాంపల్లి 7వ మున్సిఫ్ సెషన్స్ జడ్జి సమక్షంలో హాజరుపర్చిందుకు తీసుకెళ్తున్నారు.

మార్గంమధ్యలో వికారుద్దీన్ అకస్మాత్తుగా పోలీసుల వద్ద ఉన్న ఇన్సస్ రైఫిల్ లాక్కొని ఆర్‌ఎస్‌ఐపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపామని, ఈ కాల్పుల్లో ఐదుగురు రిమాండ్ ఖైదీలు కూడా మృతిచెందినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఈ ఘటనపై 7న ఆలేరు తహసీల్దారు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు బహిరంగ వి చారణ నిర్వహిస్తున్నందునా ఎవరైనా సమాచారం చెప్పాలనుకుంటే విచారణకు హాజరుకావాలని ఆర్డీవో ప్రకటనలో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement