రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి
తాండూరు, న్యూస్లైన్: వికారాబాద్ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గురువారం పట్టణంలోని నిర్వహించిన పౌరసన్మాన కార్యక్రమానికి ఆయన తొలిసారి తాండూరుకు విచ్చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎప్పటి నుంచో ప్రతిపాదనలో ఉన్న వికారాబాద్ను కచ్చితంగా జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాకు వైద్య కళాశాల మంజూరైతే అది తాండూరులో ఏర్పాటయ్యేలా చూస్తానని, చాలా కాలంగా ప్రతిపాదనలో ఉన్న కార్మిక బీమా ఆస్పత్రి ఏర్పాటుకు సైతం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
పశ్చిమ రంగారెడ్డిని విద్యాపరంగా అభివృద్ధి చేస్తానని, వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పాటుపడతానన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా నెరవేరుస్తారని పేర్కొన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు, మైనార్టీలతోపాటు అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తారన్నారు. తాండూరు, యాలాల పీఏసీఎస్ చైర్మన్లు నారాయణగౌడ్, సిద్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా రుణాల మాఫీ చేయించేందుకు కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కరణం పురుషోత్తంరావు, రవిగౌడ్, రవూఫ్, నరేందర్గౌడ్, వెంకటయ్య, అయూబ్ఖాన్, బాల్రెడ్డి, పి.నర్సింహులు, అజయ్ప్రసాద్, గాజీపూర్ నారాయణరెడ్డి, భరత్భూషన్, మున్సిపల్ కౌన్సిలర్లు విజయలక్ష్మి, నీరజ, శోభారాణి, పరిమళ, రజాక్, ఖవి, విజయాదేవి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి ఘన స్వాగతం
తాండూరు టౌన్: రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా గురువారం తాండూరుకు వచ్చిన మహేందర్రె డ్డికి టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. స్థానిక విలియంమూన్ చౌరస్తా నుంచి బైకు ర్యాలీ నిర్వహించారు పట్టణ మున్సిపల్ కమిషనర్ గోపయ్య తన సిబ్బందితో కలిసి కార్యాలయం వద్ద బతుకమ్మలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి ఓపెన్టాప్ జీపులో పట్టణ ప్రజలకు అభివాదం చేస్తూ ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం స్థానిక క్లాసిక్ గార్డెన్స్లో పలువురు నాయకులు, కార్యకర్తలు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు, పట్టణ ప్రముఖులు, కులసంఘాల నాయకులు, పలు అసోసియేషన్ల ప్రతినిధులు మంత్రిని ఘనంగా సన్మానించారు.
భూకైలాస్ సందర్శన
తాండూరు రూరల్: మండల పరిధిలోని అంతారం తండాలో వెలసిన భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానాన్ని మంత్రి మహేందర్రెడ్డి దర్శించుకున్నారు. తాండూరులో నిర్వహించిన సన్మాన సభ అనంతరం ఆయన భూకైలాస్ను సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వ్యవస్థాపకులు వాసు నాయక్ పవార్ మంత్రిని సన్మానించారు. మంత్రి వెంట తాండూరు జెడ్పీటీసీ రవిగౌడ్, మాజీ ఎంపీపీ రాంలింగారెడ్డి, నాయకులు మాధవరెడ్డి, వడ్డె శ్రీను, శేఖర్ తదితరులు ఉన్నారు.
వికారాబాద్ను జిల్లా కేంద్రం చేస్తాం
Published Thu, Jun 5 2014 11:58 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement