మేడారం జాతరలో అపశ్రుతి | Two Medaram devotees dies after falls down in Jampanna Vagu | Sakshi
Sakshi News home page

మేడారం జాతరలో అపశ్రుతి

Feb 4 2020 5:09 PM | Updated on Feb 4 2020 5:48 PM

Two Medaram devotees dies after falls down in Jampanna Vagu - Sakshi

మేడారంలో మృతి చెందిన వినయ్‌ మృత దేహం (ఇన్‌సెట్‌లో )

మేడారం జాతరలో అపశ్రుతి చోటుచేసుకుంది.

సాక్షి, వరంగల్‌ : మేడారం జాతరలో అపశ్రుతి చోటుచేసుకుంది. జంపన్నవాగులో పడి ఇద్దరు మృతి చెందారు. మృతులు సికింద్రాబాద్‌కు చెందిన వినయ్, దుమ్ముగూడెం మండలం సుబ్బారావుపేటకు చెందిన వినోద్‌గా గుర్తించారు. వీరిద్దరు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారక్క అమ్మవార్ల దర్శనానికి వచ్చి స్నానాలు చేసేందుకు జంపన్నవాగులో దిగారు. ఈ క్రమంలో వారికి మూర్ఛ వచ్చి వాగులో పడి మృతిచెందారు. మరోవైపు లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి మేడారం బాటపట్టారు. పెద్ద మొత్తంలో వాహనాలు బారులు తీరడంతో పోలీసులు ట్రాఫిక్‌ నియంత్రణ కోసం కసరత్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement