రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం | two died in rajanna sircilla district | Sakshi
Sakshi News home page

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం

Oct 20 2017 11:43 AM | Updated on Aug 25 2018 6:06 PM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది.

సాక్షి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. సిరిసిల్ల పట్టణంలో శుక్రవారం కొత్త చెరువులో పడి ఇద్దరు బాలురు మృతిచెందారు. శాంతినగర్‌కు చెందిన సాయిరాహుల్ (14) ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. సయ్యద్ తాజ్ (13) ఏడవ తరగతి చదువుతున్నాడు.

వీరిద్దరూ గురువారం ఉదయం  ఈతకు వెళ్లారు. సాయంత్రం అయిన తిరిగి రాకపోవడంతో చెరువులో వెతకగా వీరిద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాలను వెలికి తీయించి పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement