'ఆ జంట ఏకాంతంగా ఉన్న సమయంలోనే చిత్రీకరించారు' | two accussed held of gang rape on girl | Sakshi
Sakshi News home page

'ఆ జంట ఏకాంతంగా ఉన్న సమయంలోనే చిత్రీకరించారు'

Dec 4 2014 11:22 AM | Updated on Sep 2 2017 5:37 PM

ఆ ప్రేమజంట ఏకాంతంగా ఉన్న సమయంలోనే ఇద్దరు వ్యక్తులు వారిని సెల్ ఫోన్ లో చిత్రీకరించిన అనంతరం బెదిరింపులకు పాల్పడ్డారన్నారు.

హైదరాబాద్: నగర శివార్లులోని సంఘీ టెంపుల్ సమీపంలో ప్రేమ జంటపై దాడి, నగ్న దృశ్యాలకు సంబంధించి ఏసీపీ భాస్కర్ స్పందించారు. ఈ ఘటనపై గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆ జంట ఏకాంతంగా ఉన్న సమయంలోనే  ఇద్దరు వ్యక్తులు వారిని సెల్ ఫోన్ లో చిత్రీకరించిన అనంతరం బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. ఈ క్రమంలోనే ఆ యువతి కూడా వచ్చిన యువకుడు పారిపోవడంతో ఆమెపై ఇద్దరు నిందితులు అత్యారానికి ఒడిగట్టారన్నారు. ఈ విషయాన్ని బయటకు చెబితే ఇంటర్ నెట్ లో పెడతామని బెదిరించినట్లు ఏసీపీ తెలిపారు.

 

తొలుత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడిందని.. ఆ తరువాత ఆమె ఫిర్యాదుతోనే కేసు నమోదు చేశామన్నారు. ఆ నిందితుల నుంచి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రస్తుతం సెల్ ఫోన్ ను ఫోరెనిక్స్ ల్యాబ్ కు పంపామని.. ఆ నివేదిక వచ్చాక చార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు. ఆ నిందితులు పెద్ద అంబర్ పేటకు చెందిన వెల్డర్ నల్లబోను శ్రీనివాస్ రెడ్డి, మెకానిక్ బండి లింగారెడ్డిలుగా గుర్తించామన్నారు. వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని ఏసీపీ భాస్కర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement