ఇన్నోవా - స్విఫ్ట్ కార్లు ఢీ: ఐదుగురి మృతి | Three killed in road accident at shadnagar bypass road | Sakshi
Sakshi News home page

ఇన్నోవా - స్విఫ్ట్ కార్లు ఢీ: ఐదుగురి మృతి

Jun 21 2015 6:18 PM | Updated on Aug 30 2018 3:56 PM

మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ బైపాస్ రోడ్డు జాతీయ రహదారిపై ఆదివారం ఇన్నోవా - స్విఫ్ట్ కారు ఢీ కొన్నాయి.

మహబూబ్నగర్ : షాద్‌నగర్ లోని జాతీయ రహదారిపై ఇన్నోవా, స్విఫ్ట్ కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు మృత్యువాతపడగా మరొ ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్‌లోని కాటేదాన్‌కు చెందిన చంద్రప్రదీప్(20), సూర్యప్రణయ్(19), మహేష్ (19), సాయితేజ్ అలియాస్ రింకూ(14), రామాంజులు(24), మేఘప్రశాంత్ షాద్‌నగర్ సమీపంలో ఉన్న ఫాంహౌస్‌లో జరుగుతున్న శుభకార్యానికి బయలుదేరారు.

 

పట్టణ శివారులోని హెచ్‌పీ పెట్రోల్ పంపు వద్ద ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొని అవతల రోడ్డుపై వస్తున్న వీరి కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో రామాంజులు, మహేష్ అక్కడికక్కడే మృతి చెందగా రింకూ, చంద్రప్రదీప్, సూర్యప్రణయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మేఘప్రశాంత్ హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇన్నోవాలో బెలూన్స్ తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని వ్యక్తికి గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement