మీడియాను బెదిరించడం సరికాదు | Threatening Media is not correct, Indian Newspaper Society | Sakshi
Sakshi News home page

మీడియాను బెదిరించడం సరికాదు

Sep 19 2014 1:33 AM | Updated on Oct 9 2018 6:34 PM

పత్రికలపై ఫిర్యాదులు ఏవైనా ఉంటే వాటికి న్యాయపరమైన పరిష్కారాలు ఉన్నాయని

సాక్షి, న్యూఢిల్లీ: పత్రికలపై ఫిర్యాదులు ఏవైనా ఉంటే వాటికి న్యాయపరమైన పరిష్కారాలు ఉన్నాయని.. అంతేగాని వాటిని భయపెట్టడం, బెదిరించడం సబబు కాదని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్‌ఎస్) పేర్కొంది. ముఖ్యంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం సరికాదని పేర్కొంది. 
 
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలు ప్రమాదకరమైనవిగా ఐఎన్‌ఎస్ గుర్తించిందని ఆ సంస్థ సెక్రెటరీ జనరల్ వి.శంకరన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ సభ్య ప్రచురణ సంస్థలు భయానికి, వేధింపులకు గురైతే... అన్ని వనరులను వినియోగించుకుని ప్రతిఘటించడానికి సంస్థ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement