కరీంనగర్ జిల్లాలో ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న గోపి పవన్ అనే దొంగని అదుపులోకి తీసుకున్నారు.
గోదావరిఖని: కరీంనగర్ జిల్లాలో ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న గోపి పవన్ అనే దొంగని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.3.5 లక్షల విలువైన లాప్టాప్తో పాటు బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.