సిర్పూర్-కాగజ్నగర్ వద్ద రామగిరి ఎక్స్ప్రెస్ రైల్లో చోరీ జరిగింది.
రైల్లో చోరీ....
Mar 5 2017 4:37 PM | Updated on Sep 5 2017 5:17 AM
మంచిర్యాల క్రైం: సిర్పూర్-కాగజ్నగర్ వద్ద రామగిరి ఎక్స్ప్రెస్ రైల్లో చోరీ జరిగింది. తిరుపతమ్మ అనే మహిళా పశువైద్యాధికారిని గాయపరిచి ఓ దుండగుడు రూ.25 వేల నగదు ఎత్తుకెళ్లాడు. రైలు వేగం కాస్త తగ్గగానే దిగి పారిపోయాడు. ఈ సంఘటన శనివారం సాయంత్రం జరిగినా ఆలస్యంగా ఆదివారం మధ్యాహ్నాం వెలుగులోకి వచ్చింది. గాయపడిన మహిళకు మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement