మరో అన్నదాత ఆత్మహత్య | The farmer commits suicide | Sakshi
Sakshi News home page

మరో అన్నదాత ఆత్మహత్య

Oct 26 2015 4:29 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పులబాధ భరించలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు

అప్పులబాధ భరించలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మేళ్ల చెరువు మండలం ఎల్లటూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బంటు కిష్టయ్య(45) తనకున్న ఐదెకరాల భూమిలో పత్తి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పు పెరిగి పోవడంతో వాటిని తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement