పత్తిరైతు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

పత్తిరైతు ఆత్మహత్య

Published Thu, Mar 24 2016 2:25 PM

The Cotton farmer commits suicide

 అప్పుల బాధ తాళలేక పత్తిరైతు ఉరి వేసుకొని తనువు చాలించాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా డిండి మండలం దాసరనెమలిపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శీనయ్య(38) పత్తి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. వాటిని తీర్చే దారికానరాక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చే సుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement