యువకుని దారుణ హత్య | The brutal murder of a young man | Sakshi
Sakshi News home page

యువకుని దారుణ హత్య

Jan 18 2016 10:48 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలం కృష్ణపల్లి గ్రామ శివారులో సోమవారం దారుణ హత్య జరిగింది.

ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలం కృష్ణపల్లి గ్రామ శివారులో సోమవారం దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన రవీందర్ (30)ను ముగ్గురు దుండగులు హతమార్చారు. అనంతరం బెల్లంపల్లి పోలీస్ స్టేషన్ లో లొంగి పోయారు. రవీందర్ తమ్ముడు తమకు రూ.5లక్షలు ఇచ్చి హత్య చేయించాడని వారు పోలీసుల ఎదుట వాగ్మూలం ఇచ్చారు.


నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. రవీందర్ తమ్ముడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా.. రవీందర్ హత్యకు గల కారణలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement