తెలంగాణకు ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’ అవార్డు  | Telangana Receives Swachh Survekshan Grameen Award | Sakshi
Sakshi News home page

తెలంగాణకు ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’ అవార్డు 

Nov 20 2019 3:26 AM | Updated on Nov 20 2019 3:26 AM

Telangana Receives Swachh Survekshan Grameen Award - Sakshi

కేంద్ర మంత్రి సదానందగౌడ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న మంత్రి ఎర్రబెల్లి

సాక్షి, న్యూఢిల్లీ : మెరుగైన పారిశుద్ధ్య విధానాల అమలు, ఫలితాల సాధనకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్రానికి 2019 ఏడాదికిగానూ స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ అవార్డు దక్కింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సదానందగౌడ చేతుల మీదుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యంగా సర్పంచుల చొరవతోనే ఈ ఘనత సాధ్యమైందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement