త్వరలో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో హైదరాబాద్ సిటీలోని ఐదు వేల కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. టీఎంవై గ్రూప్ ఆధ్వర్యంలో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ చంపాపేటలోని లక్ష్మారెడ్డి గార్డెన్ లో నిర్వహించిన జాబ్ మేళాలో ఆయన మాట్లాడారు. స్థానిక పోలీస్ స్టేషన్లలో ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని.. వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు. ఈ మేళాలో ఇరవై అయిదు కంపెనీలు పాల్గొన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top