తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవోకు అనుగుణంగా మహబూబ్నగర్ జిల్లా అధికారులు చర్యలు ప్రారంభించారు.
మహబూబ్నగర్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవోకు అనుగుణంగా మహబూబ్నగర్ జిల్లా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఉద్యానశాఖలో సూక్ష్మసేద్యం పథకాన్ని (తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్) విలీనం చేస్తున్నట్లు మంగళవారం జిల్లా కలెక్టర్ టీకే. శ్రీదేవి ప్రకటించారు.
అంతేకాకుండా ఉద్యానశాఖ రెండో సహాయ సంచాలకుల కార్యాలయాన్ని త్వరలోనే నాగర్కర్నూల్కు తరలిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ రెండు శాఖల విలీనంతో సిబ్బంది కొరత తీరడంతో పాటు సంక్షేమ పథకాలు వేగం పుంజుకునే అవకాశం ఉందని చెప్పారు.