'మిషన్‌ కాకతీయ' పనుల్లో డిప్యూటీ స్పీకర్ | Telangana Deputy Speaker participates in Mission Kakatiya | Sakshi
Sakshi News home page

'మిషన్‌ కాకతీయ' పనుల్లో డిప్యూటీ స్పీకర్

May 21 2015 2:44 PM | Updated on Sep 3 2017 2:27 AM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో రాజకీయనాయకులు, అధికారులు పాలు పంచుకుంటున్నారు.

మెదక్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో రాజకీయనాయకులు, అధికారులు పాలు పంచుకుంటున్నారు. తాజాగా మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలోని కవలంపేట చెరువును టీయూడబ్ల్యుజే (తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) దత్తత తీసుకుంది. ఈ చెరువులో పూడికతీత పనులను గురువారం డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చింతా ప్రభాకర్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్‌ బొజ్జ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement