తెలంగాణ శాసనసభ మంగళవారానికి వాయిదా పడింది.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం సభలో ఏపీఐఐసీ భూముల వ్యవహారంపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు భూముల వ్యవహారం గురించి సభలో మాట్లాడారు. కాగా తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వగా, సభలో గందరగోళం చోటుచేసుకుంది. దీంతో స్పీకర్ మధుసూదనా చారి మధ్యాహ్నం సభను అరగంట వాయిదా వేశారు. అనంతరం సాయంత్రం వరకు సాగింది.