మూడు స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు: చాడ | Support Congress in Three Seats Says Chada Venkatreddy | Sakshi
Sakshi News home page

మూడు స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు: చాడ

Mar 31 2019 2:09 AM | Updated on Mar 31 2019 2:09 AM

Support Congress in Three Seats Says Chada Venkatreddy  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి, కరీంనగర్, మహబూబ్‌నగర్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఈ స్థానాల్లో పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి (మల్కాజిగిరి), పొన్నం ప్రభాకర్‌ (కరీంనగర్‌), వంశీచంద్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌) తమ పార్టీ మద్దతు కోసం సంప్రదించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి జాతీయ పార్టీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం పోటీ చేస్తున్న 4 సీట్లలో పరస్పరం సహకరించుకుంటామన్నారు. మిగతా చోట్ల బీజేపీ, టీఆర్‌ఎస్‌లను ఓడించగలిగే లౌకిక పార్టీల అభ్యర్థులకు మద్దతునివ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇత ర స్థానాల్లో ఎవరికి మద్దతునివ్వాలనే దానిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయిస్తామన్నారు. కాగా, ఆదివా రం అల్వాల్‌లో లోక్‌సభ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు బాలమల్లేశ్‌ తెలిపారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement