విద్యార్థులపై తేనెటీగల దాడి | Students attacked by bees | Sakshi
Sakshi News home page

విద్యార్థులపై తేనెటీగల దాడి

Apr 6 2015 12:31 PM | Updated on Sep 2 2017 11:56 PM

స్కూలు విద్యార్థులపై తీనెటీగలు దాడిచేసిన సంఘటన ఖమ్మం జిల్లా ముల్కపల్లి మండలంలోని పుసుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని వేముకుంటలో సోమవారం చోటు చేసుకుంది.

ఖమ్మం : స్కూలు విద్యార్థులపై తీనెటీగలు దాడిచేసిన సంఘటన ఖమ్మం జిల్లా ముల్కపల్లి మండలంలోని పుసుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని వేముకుంటలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు ఈ దాడిలో గాయాలపాలయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియరావాల్సి ఉంది.
(ముల్కపల్లి)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement