సోషల్‌ మీడియా బాధితులకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ | Special Website For Social Media Victims | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా బాధితులకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌

Jan 18 2019 10:21 AM | Updated on Jan 18 2019 10:42 AM

Special Website For Social Media Victims - Sakshi

హిమాయత్‌నగర్‌: సోషల్‌ మీడియాలో ప్రముఖులు, సామాన్యులపై వస్తున్న దుష్ప్రచారంపై ‘హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ సౌత్‌ రీజన్‌ తీవ్రంగా స్పందించింది. ఇటీవల ప్రముఖలను టార్గెట్‌ చేస్తూ వారిపై ఇష్టానుసారంగా సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం జరగడం, బాధితులు పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కడం బాధగా ఉందని సౌత్‌రీజన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ జి.అనూహ్యరెడ్డి అన్నారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి తాము అండగా ఉంటామని తెలిపారు. ఇలాంటి దుష్ప్రచారాలతో ప్రముఖులు వార్తల్లోకి ఎక్కడంతో పాటు వారి వ్యక్తిగత జీవితం సర్వనాశనం అవుతుందన్నారు.

బాధితులను సంఘటితం చేస్తూ ఇలాంటి దుష్ప్రచారాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా సౌత్‌ఇండియాలో ఓ వైబ్‌సైట్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ప్రతి ఒక్కరూ తమ సమస్యను అప్‌లోడ్‌ చేస్తే తమకు నేరుగా మెసేజ్‌ అందుతుందన్నారు. బాధితులతో అప్పటికప్పుడు మాట్లాడి, వివరాలు తెలుసుకుని సమీపంలోని పోలీసు స్టేషన్‌కు అనుసంధానం చేస్తామన్నారు. ప్రతి గ్రామంలోనూ తమ వాలంటీర్లు ఉన్నారని వారు బాధితుల సమస్యలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ అన్యాయం జరుగుతున్న చోట ‘హూమన్‌ రైట్స్‌’ నుంచి భరోసా కల్పిస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement