పబ్లిక్‌ కాంటాక్ట్‌ ద్వారా సేవలు | SP Ranganath Speaks With Media | Sakshi
Sakshi News home page

పబ్లిక్‌ కాంటాక్ట్‌ ద్వారా సేవలు

Mar 14 2018 9:27 PM | Updated on Aug 29 2018 4:18 PM

SP Ranganath Speaks With Media - Sakshi

నల్గొండ : నల్గొండ జిల్లా ఎస్పీగా వెంకట రంగనాథ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. నేరుగా కలుసుకోవడం ద్వారా ప్రజలకు సేవలందిస్తానని చెప్పారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, ఎఫెక్టివ్‌ పోలీసింగ్‌ ఇవ్వడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీస్‌ ఉక్కు పాదం మోపుతుందన్నారు. అక్రమ భూ దందాలకు, సెటిల్‌మెంట్‌లకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ద్వారా ప్రత్యేక సోషల్‌ కార్యక్రమాలు కొనసాగుతాయని నూతన ఎస్పీ వెంకట రంగనాథ్‌ వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement