పతకాల ‘పల్లె’ | Scouts and Guides Medal 'village' | Sakshi
Sakshi News home page

పతకాల ‘పల్లె’

Feb 14 2015 4:56 AM | Updated on Sep 2 2017 9:16 PM

పతకాల ‘పల్లె’

పతకాల ‘పల్లె’

క్రమశిక్షణకు వారు మారుపేరుగా నిలుస్తారు. సోదరభావంతో మెలుగుతారు.

క్రమశిక్షణకు వారు మారుపేరుగా నిలుస్తారు. సోదరభావంతో మెలుగుతారు. సేవా కార్యక్రమాలలో ముందుంటారు. ఆ విద్యార్థులు మారుమూల గ్రామం నుంచి జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభను చూపుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దీనతంటికి కారణం వారు స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో చేరడమే. ఉపాధ్యాయుల నిర్వి రామ కృషి, గ్రామస్తుల సహకారంతో విద్యార్థులు రాజ్యపురస్కార్ అవార్డును అందుకున్నారు.
 
సేవామూర్తుల ముల్లె
- స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో రాణిస్తున్న ‘గిద్ద’ విద్యార్థులు
- క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్న హైస్కూల్

సదాశివనగర్: సదాశివనగర్ మండలంలోని ‘గిద్ద’ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్‌గా చేరి ‘ఉత్తములు’గా రూపొందుతున్నారు. ఈ పా ఠశాలలో మొదటగా 2009లో స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను ప్రారంభించారు. ప్రారంభంలో విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కార్యక్రమాలు కూడా మొక్కుబడి గా సాగేవి. ఈ క్రమంలో సౌజన్యకుమా ర్ అనే ఉపాధ్యాయుడు 2008-2009లో పాఠశాలకు వచ్చారు. ఆయన స్కౌట్ మాస్టర్ కూడా కావడంతో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. దేవుళ అనే మరో ఉపాధ్యాయుడు అసిస్టెంట్ స్కౌట్ మా స్టర్‌గా వ్యవహరించారు.

వీరిద్దరు కలిసి బాలబాలికలను మెరికలుగా తీర్చిదిద్దా రు. వారి చేత నిత్య సాధన చేయిస్తూ, జా తీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచేలా చేశారు. జంబోరీలో గ్యాడ్జెట్స్ నిర్మాణం, కలర్ పార్టీ, మార్చ్ ఫాస్ట్, అడ్వెంచర్ యాక్టివిటీ, సిగ్నలింగ్, టవర్ విల్డింగ్, యూత్ కాంగ్రెస్, భారత్ నిర్మాణ్, ఫుడ్‌ప్లాజా, స్కిల్ ఓ-రమ వంటి అంశాలలో విద్యార్థులు తిరుగులేని నైపుణ్యాన్ని సాధించారు. చిరస్మరణీయమైన విజయాలనెన్నింటినో అందుకున్నారు. పతకాల మీద పతకాలను సాధించారు. ఊరి పేరు ను నిలిపి, జిల్లా ప్రతిష్టను సరిహద్దులు దాటించారు.
 
సామాజిక కార్యక్రమాలతో

 మొక్కల పెంపకం, పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ ని షేధం, పార్థీనియం మొక్కల నివారణ, మరుగుదొడ్ల నిర్మాణం, వాడకంపై ప్రచారం, వయోజన విద్య, నీటి పారిశుధ్యంపై అవగాహన తదితర సేవా కార్యక్రమాలలో స్కౌట్లు, గైడ్లు పాలుపంచుకుంటున్నారు.
 సాధించిన విజయాలు
2009 నవంబర్ 22న హైదరాబాద్‌లోని జీడిమె ట్ల ‘పెట్రో లీడర్ క్యాంప్ స్టేట్ ట్రైనింగ్ సెంటర్’ నిర్వహించిన శిబిరంలో నరేశ్, శ్రీకాంత్ ప్రతిభను చూపారు.
2010 జనవరి 26న రిపబ్లిక్‌డే పరేడ్‌లో పాఠశాల నుంచి నలుగురు స్కౌట్లు, నలుగురు గైడ్స్ పాల్గొన్నారు.
2010 నవంబర్ 15నుంచి 19వరకు పాఠశాలలో 120మంది స్కౌట్స్, 10మంది గైడ్స్‌తో, స్కౌట్ మాస్టర్లతో సన్నాహక శిబిరం నిర్వహించారు.
2010 డిసెంబర్ 22న హైదరాబాద్‌లో జరిగిన జంబోరీకి గిద్ద పాఠశాల నుంచి 21 మంది గైడ్స్, 25మంది స్కౌట్స్, ఇద్దరు స్కౌట్ మాస్టర్లు హాజరయ్యారు.
2010 ఫిబ్రవరిలో నిర్వహించిన రాజ్యపురస్కార్ టెస్టింగ్ శిబిరంలో నలుగురు విద్యార్థులు గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.  
అడ్వెంచర్ విభాగంలో 36 అంశాలలో పోటీ పడి 25 మంది బంగారు పతకాలు, 20 మంది వెండి పతకాలు సాధించారు.
జాతీయ స్థాయి మార్చింగ్ కాంపిటేషన్‌లో రాష్ట్రం నుంచి 45 మంది ఎంపిక కాగా, అందులో 25 మంది స్కౌట్స్, గైడ్స విద్యార్థులు గిద్ద పాఠశాలకు చెందినవారే.
పీస్ మార్చ్‌లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు.
ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా మద్ధికుంట జాతర, పోసానిపేట్ జాతరలో సేవలు అందిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement