విద్యార్థినులను బంధించి పూజలు | School worker frightens students | Sakshi
Sakshi News home page

విద్యార్థినులను బంధించి పూజలు

Jun 29 2015 3:30 PM | Updated on Sep 3 2017 4:35 AM

వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాలలో పూనకంతో ఊగిపోయిన ఓ వర్కర్ విద్యార్థినులను బంధించి పూజలు చేసింది.

వరంగల్ (ఏటూరు నాగారం) : వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాలలో పూనకంతో ఊగిపోయిన ఓ వర్కర్ విద్యార్థినులను బంధించి పూజలు చేసింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. పదవ తరగతి విద్యార్థినులను వారి తరగతి గదిలోనే బంధించి పూజలు చేసింది. దీంతో వారంతా  భయాందోళనకు గురయ్యారు.

ఈ సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియాపై కూడా ఆమె చిర్రుబుర్రులాడింది. సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్‌కు వచ్చి హల్‌చల్ చేసిన సదరు మహిళను మందలించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయులకు పోలీసులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement