సాక్షి ఇండియా స్పెల్‌ బీ విజేతలు వీరే | Sakshi India Spell Bee Winners | Sakshi
Sakshi News home page

సాక్షి ఇండియా స్పెల్‌ బీ విజేతలు వీరే

Mar 5 2018 2:11 AM | Updated on Aug 20 2018 8:24 PM

Sakshi India Spell Bee Winners

హైదరాబాద్‌ : ‘సాక్షి’ మీడియా గ్రూప్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి ఇండియా స్పెల్‌బీ, మ్యాథ్‌బీ–2017 (కేటగిరీ–1, తెలంగాణ రాష్ట్రం) విజేతలను ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలు ఎంతో ఉత్కంఠగా కొనసాగాయి. చివరగా నిర్వహించిన ఫైనల్స్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు.

ఈ సందర్భంగా విజేతలు, వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఇంగ్లిష్‌ భాషపై, మ్యాథ్స్‌ విషయంలో అంతర్గతంగా ఉన్న భయాలు పోగొట్టి, వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడంతో పాటు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఈ పోటీలు కలిగించాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.

స్పెల్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని కౌశల్య గ్లోబల్‌ స్కూల్‌లో చదువుతున్న ఎన్‌.హిృదయ్‌ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్‌ గిఫ్ట్‌ హాంపర్‌ అందజేశారు.

మ్యాథ్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్, నాదర్‌గుల్‌ బ్రాంచిలో చదువుతున్న అజిత్‌ కుమార్‌ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్‌ గిఫ్ట్‌ హాంపర్‌ అందజేశారు.

స్పెల్‌బీ ద్వితీయ బహుమతి:  హైదరాబాద్‌లోని భారతి విద్యాభవన్‌ పబ్లిక్‌ స్కూల్, జూబ్లీహిల్స్‌ బ్రాంచిలో చదువుతున్న ఎం.టీస్తా కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్‌ గిఫ్ట్‌ హాంపర్‌ అందజేశారు.

మ్యాథ్‌బీ ద్వితీయ బహుమతి: హైదరాబాద్‌లోని ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్, అత్తాపూర్‌ బ్రాంచిలో చదువుతున్న జోయా అహ్మద్‌ కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్‌ గిఫ్ట్‌ హాంపర్‌ అందజేశారు.

స్పెల్‌బీ తృతీయ బహుమతి: హైదరాబాద్‌లోని చిరక్‌ ఇంటర్నేçషనల్‌ స్కూల్, కొండాపూర్‌లో చదువుతున్న స్వరా మిశ్రా కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్‌ గిఫ్ట్‌ హాంపర్‌ అందజేశారు.

మ్యాథ్‌బీ తృతీయ బహుమతి: హైదరాబాద్‌లోని చిరక్‌ ఇంటర్నేçషనల్‌ స్కూల్, కొండాపూర్‌లో చదువుతున్న స్వరా మిశ్రా కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్‌ గిఫ్ట్‌ హాంపర్‌ అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement