కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు | RTA raids on private School and College buses second day | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు

Jul 26 2014 11:13 AM | Updated on Sep 15 2018 4:05 PM

తెలంగాణ వ్యాప్తంగా రెండోరోజు ఆర్టీఏ దాడులు కొనసాగుతున్నాయి. శనివారం ఆర్టీఏ అధికారులు కూకట్‌పల్లిలో...

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రెండోరోజు ఆర్టీఏ దాడులు కొనసాగుతున్నాయి. శనివారం ఆర్టీఏ అధికారులు కూకట్‌పల్లిలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని 12 పాఠశాల బస్సులపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా రెండు బస్సులను సీజ్ చేశారు. ఫైర్ స్టేఫ్టీ లేమి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు లేని కారణంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.


ఈ సందర్భంగా నిబంధనలు పాటించని పాఠశాల యాజమాన్యాలకు అధికారులు నోటీసులను పంపించారు.  వనస్థలిపురంలో 11, కొంపల్లిలో 8 బస్సులను సీజ్ చేశారు. మెదక్ జిల్లావ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 14 స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. కరీంనగర్లో 24 స్కూల్ బస్సులపై కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement