విద్యుత్ ఉత్పత్తి కోసం రూ.95 వేల కోట్లు | Rs 95 crore for the production of electricity | Sakshi
Sakshi News home page

విద్యుత్ ఉత్పత్తి కోసం రూ.95 వేల కోట్లు

Dec 19 2015 4:15 AM | Updated on Oct 22 2018 8:31 PM

విద్యుత్ ఉత్పత్తి కోసం రూ.95 వేల కోట్లు - Sakshi

విద్యుత్ ఉత్పత్తి కోసం రూ.95 వేల కోట్లు

వచ్చే నాలుగేళ్లలో విద్యుత్ ఉత్పత్తి కోసం రూ.95 వేల కోట్లతో యాక్షన్‌ప్లాన్ తయారు చేశామని టీఎస్ ఎస్‌పీడీసీఎల్ సీఎండీ జి. రఘుమారెడ్డి తెలిపారు.

మార్చి నుంచి నిరంతరం సరఫరా
రఘుమారెడ్డి వెల్లడి


 జగదేవ్‌పూర్: వచ్చే నాలుగేళ్లలో విద్యుత్ ఉత్పత్తి కోసం రూ.95 వేల కోట్లతో యాక్షన్‌ప్లాన్ తయారు చేశామని టీఎస్ ఎస్‌పీడీసీఎల్ సీఎండీ జి. రఘుమారెడ్డి తెలిపారు. అలాగే 5 వేల సౌరవిద్యుత్ మెగావాట్లకు ప్లాన్ చేశామని, మార్చిలోపు కరెంట్ కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా ఎర్రవల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2018-19కు నాటికి 24 వేల మెగావాట్ల విద్యుత్ కోసం రూ. 95 వేల కోట్లతో యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు చెప్పారు.

అలాగే రూ.5 వేల కోట్లతో సౌరవిద్యుత్ కోసం ప్లాన్ చేస్తున్నామన్నారు. 2 వేల మెగావాట్ల సౌరవిద్యుత్ కోసం టెండర్లు పిలిచామన్నారు. రూ. 2 వేల కోట్లతో మరమ్మతు పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి పగటి పూట 9 గంటల పాటు కరెంట్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. సీఎం నిర్వహించే అయుత చండీయాగానికి విద్యుత్ సమస్య లేకుండా గజ్వేల్ పరిధిలోని అన్ని సబ్‌స్టేషన్లలో మరమ్మతు పనులు చేశామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement