పాత మార్గదర్శకాల ప్రకారమే కసరత్తు
ముఖ్యమంత్రి వద్ద ఫైలు,స్వచ్ఛ హైదరాబాద్ తర్వాత ఉత్తర్వులు
రెండేళ్ల సర్వీసు నిండితేనే బదిలీకి అర్హులు
ఐదేళ్లు ఒకేచోట ఉంటే నిర్బంధ బదిలీ
20 రోజులపాటు కౌన్సెలింగ్కు అవకాశం
ఉపాధ్యాయుల బదిలీ, {పమోషన్లు, హేతుబద్ధీకరణ కూడా
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైంది. గతంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారమే ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఆర్థిక శాఖ కసరత్తును పూర్తి చేసింది. సంబంధిత ఫైలును ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించింది. ప్రస్తుతం బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతోపాటు తాజా బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా అందులో పొందుపరచింది. దీన్ని ముఖ్యమంత్రి ఆమోదించిన తర్వాత ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో సీఎం కె.చంద్రశేఖర్రావు బిజీగా ఉన్నందున.. గురువారం ఆ కార్యక్రమం ముగిసిన తర్వాతే ఫైలు ముందుకు కదులుతుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ఉద్యోగుల సాధారణ మిగతా 2వ పేజీలో ఠ
బదిలీలకు ఏపీ సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఉద్యోగుల్లోనూ ఇదే అంశం చర్చనీయాంశమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013 మేలో దాదాపు అన్ని విభాగాల్లో సాధారణ బదిలీలు జరిగాయి. ఆ తర్వాత బదిలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. సాధారణంగా ప్రతి ఏడాది మే నెలలో సాధారణ బదిలీలకు సర్కారు వెసులుబాటు కల్పిస్తుంది. కానీ గత ఏడాది తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన పరిణామాలతో ఈ ప్రక్రియను చేపట్టలేదు. దీంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని విభాగాల ఉద్యోగుల నుంచి బదిలీలకు సంబంధించిన విజ్ఞప్తులు, దరఖాస్తులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. అధికారవర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈసారి బదిలీలకూ గతంలో ఉన్న నిబంధనలనే పాటిస్తారు.
20 శాతం మించకుండా బదిలీలు
కమలనాథన్ కమిటీ పరిధిలో ఉన్న రాష్ట్ర కేడర్, మల్టీ జోనల్ పోస్టులు మినహా.. మిగతా కేడర్ ఉద్యోగులకు సాధారణ బదిలీలతో చిక్కులేమీ ఉండవని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. నిషేధం ఎత్తివేత ఉత్తర్వులు వెలువడ్డాక 20 రోజుల పాటు బదిలీలకు అవకాశం కల్పిస్తారు. పైరవీలు, రాజకీయ జోక్యానికి అవకాశం లేకుండా అన్ని విభాగాల్లో కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు చేపడుతారు. రెండేళ్ల కనీస సర్వీసు ఉన్న ఉద్యోగులే బదిలీలకు అర్హులవుతారు. ఐదేళ్లు ఒకేచోట పని చేసిన ఉద్యోగులను నిర్బంధంగా బదిలీ చేస్తారు. బదిలీ కోరుకునే ప్రతి ఉద్యోగి మూడు ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు సీనియారిటీ జాబితాల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అంగవైకల్యం ఉన్న వారు, భార్యాభర్తలు, ఆరోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కో కేటగిరీలో 20 శాతం మించకుండా ఉద్యోగుల బదిలీలు ఉండాలనే నిబంధనను పాటిస్తారు. వీటికి తోడు పట్టణ ప్రాంతాలు, ప్రాధాన్యత ఉన్న ఫోకల్ ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులను నాన్ ఫోకల్కు బదిలీ చేస్తారు. మారుమూల ప్రాంతాల్లో లాంగ్ స్టాండింగ్గా ఉన్న వారికి న్యాయం జరిగేలా గతంలో ఉన్న మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తారు. మరోవైపు విద్యా శాఖ సిద్ధం చేసిన ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సంబంధించిన ఫైళ్లు కూడా సీఎం దగ్గరే పెండింగ్లో ఉన్నాయి. సాధారణ బదిలీల ఫైలుతోపాటు వీటికి సైతం మోక్షం లభిస్తుందని ఉపాధ్యాయ సంఘాలు ఎదురుచూస్తున్నాయి.
ఇక బదిలీలు
Published Tue, May 19 2015 1:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్కు నోటీసులు?
హైదరాబాద్పై కుట్ర
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement