-
ఏపీ ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు
-
ఉద్యోగుల బదిలీలు నేటి నుంచే..
సాక్షి, అమరావతి : ఉద్యోగుల సాధారణ బదిలీలు మంగళవారం నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ బదిలీలకు అనుమతినివ్వగా.. ప్రస్తుతమున్న నిషేధాన్ని తొలగించారు. తిరిగి వచ్చే నెల 6న నుంచి నిషేధం అమల్లోకి రానుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ సోమవారం జీవో జారీచేశారు. అయితే, ఇప్పటికే విద్యా సంస్థలు ప్రారంభమైనందున అన్ని రకాల విద్యాశాఖలను బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎటువంటి ఆరోపణలకు, ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ బదిలీల ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా జీవోలో ప్రభుత్వం స్పష్టంచేసింది. ఉద్యోగుల రిక్వెస్ట్, పరిపాలనాపరమైన సౌలభ్యం ప్రాతిపదికగా బదిలీలు చేయాలని అందులో పేర్కొన్నారు. అలాగే, ఐదేళ్ల పాటు ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలన్నారు. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న మార్గదర్శకాలు ఇవే.. - ఉద్యోగుల బదిలీల్లో 40 శాతం పైగా అంగవైకల్యం సర్టిఫికెట్ గల వారికి ప్రాధాన్యతనివ్వాలి - ఉద్యోగుల పిల్లలు ఎవరైనా మానసిక వైకల్యంతో ఉంటే అలాంటి ఉద్యోగులను సంబంధిత వైద్య సదుపాయం గల ప్రాంతాలకే బదిలీ చేయాలి - క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి జరిగిన భార్యగాని ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నట్లయితే ఆ వైద్య సదుపాయాలున్న చోటకు మాత్రమే సంబంధిత ఉద్యోగులను బదిలీ చేయాలి. - కారుణ్య నియామకాల్లోని వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యతనివ్వాలి. - భార్యభర్తల కేసుల్లో భార్య బదిలీకి ప్రాధాన్యత ఇవ్వాలి. అదీ కూడా గతంలో ఈ సదుపాయం పొందినట్లయితే ఎనిమిదేళ్ల తరువాత మాత్రమే అనుమతించాలి. - బదిలీలన్నీ రిక్వెస్ట్ కింద పరిగణనలోకి తీసుకోవాలి. - పదోన్నతులు పొందిన ఉద్యోగులను బదిలీ చేయాలి. అయితే, బదిలీ చేసేచోట సంబంధిత పోస్టు ఉంటేనే చేయాలి. - తొలుత అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫై చేయాలి. వాటిని భర్తీచేశాకే నాన్ ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీలు చేయాలి. - ఐటీడీఏ ప్రాంతాల్లో పనిచేస్తున్న లోకల్ కేడర్, జోనల్ కేడర్ ఉద్యోగులను రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులను సీనియారిటీ ప్రాతిపదికన బదిలీలకు ప్రాధాన్యతనివ్వాలి. - ఐటీడీఏ ప్రాంతాల్లో పోస్టింగ్లకు ఉద్యోగులు 50 ఏళ్లలోపు వయస్సు గలవారై ఉండాలి. అలాగే, గతంలో ఐటీడీఏలో పనిచేయని వారై ఉండాలి. - ఐటీడీఏ పరిధిలోని మారుమూల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఖాళీలున్నాయి. వీటిని బదిలీల ద్వారా భర్తీచేయడానికి సంబంధిత శాఖాధిపతులు, కలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలి. - అన్ని బదిలీలు సంబంధిత అథారిటీ ఆదేశాలు, నిబంధనల మేరకు జరగాలి. - బదిలీ ప్రక్రియకు సంబంధిత శాఖాధిపతి బాధ్యత వహించాలి. ఎటువంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేకుండా నిబంధనలను ఉల్లంఘించకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలి. - రెవెన్యూ, ఇతర ఆర్జిత శాఖలైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలు కూడా ఆయా శాఖల మార్గదర్శకాల మేరకు వచ్చే నెల 5లోగా బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలి. - వ్యవసాయ శాఖలో బదిలీలను మాత్రం ఆయా శాఖలకు అనుగుణంగా నిర్వహించుకోవచ్చు. - స్కూలు విద్య, ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య, సంక్షేమ శాఖల విద్యా సంస్థలన్నింటిలో బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పటికే విద్యా సంస్థలు ప్రారంభమైనందున వీటిల్లో బదిలీలకు అవకాశం ఇవ్వలేదు. వీరిని బదిలీ చేయరాదు.. - వచ్చే ఏడాది మార్చి 31లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులు.. అలాగే, గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల్లో పనిచేస్తున్న వారికీ బదిలీల నుంచి మినహాయింపు ఉంది. - కంటిచూపు లేని ఉద్యోగులు ప్రత్యేకంగా వారు బదిలీకి రిక్వెస్ట్ చేస్తే తప్ప వారిని బదిలీ చేయరాదు. వారు కోరిన చోట స్పష్టమైన ఖాళీ ఉంటేనే బదిలీ చేయాలి. - ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్లో ఉన్న ఉద్యోగులతో పాటు ఇతర శాఖాపరమైన ఆరోపణలున్న వారిని కూడా. -
‘రెవెన్యూ’లో కుదుపు
సాక్షి, విశాఖపట్నం : రెవెన్యూలో కుదుపు మొదలైంది. ఇన్నాళ్లు వాయిదాలమీద వాయిదాలు పడుతూ వస్తున్న వీరి బదిలీలకు ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి లోగా వీరి బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. జీవోఎంఎస్-98 పేరి ట జారీ చేసిన ఈ ఉత్తర్వు ప్ర కారం బదిలీ ప్రక్రియ పూర్తిగా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో చేయాల్సి ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉద్యోగుల సాధారణ బదిలీలు నా లుగు నెలలుగా సాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ హయాం లో పనిచేసిన రాష్ర్ట స్థాయి అధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు ప్రతీ ఒక్కరికి స్థానచలనం కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో జారీ చేసిన జీవో-57 వివాదస్పదం కావడం.. ఇన్చార్జి మంత్రుల పర్యవేక్షణలో చేయాలన్న ఈ బదిలీల ప్రక్రియపై హైకోర్టు స్టే ఇవ్వడంతో బదిలీలకు ఆదిలోనే బ్రేకు లు పడ్డాయి. దీంతో ఇన్చార్జి మంత్రితో సంబంధం లేకుండా శాఖాధిపతుల పర్యవేక్షణలోనే బదిలీలు చేయొచ్చంటూ మలి ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ ఆగస్టు-1 నుంచి 15వ తేదీ బదిలీలకు గ్రీన్సిగ్నెల్ ఇచ్చింది. శాఖల వారీగా ైగైడ్లైన్స్ కూడా జారీ చేసింది. కానీ రెవెన్యూ శాఖను మాత్రం ఈ బదిలీల నుంచి మినహాయించింది. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం, క్షేత్ర స్థాయిలో సర్వే, గ్రామస్థాయిలో గ్రామసభల నిర్వహణ వంటి బాధ్యతలు రెవెన్యూ అధికారులపై ఉండడంతో వీరిని గత నెల బదిలీల నుంచి మినహాయింపునిచ్చారు. ఆగస్టు 31తో మీ ఇంటికి మీ భూమికి గ్రామసభలు పూర్తి కావడంతో ఇక ఈ శాఖలో కూడా బదిలీలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్-15వ తేదీ అర్ధరాత్రిలోగా ఈ బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. తొలుత జారీచేసిన జీవో-57 ప్రకారం మూడేళ్ల సర్వీసు పూర్తయిన అధికారులు, సిబ్బంది వారీగా అర్హుల జాబితాలను జూన్ లోనే సిద్ధంచేశారు. ఈ విధంగా జిల్లా రెవెన్యూ శాఖలో 1445 మంది సిబ్బంది ఉండగా, వీరిలో 659 మంది బదిలీలకు అర్హులని లెక్కతేల్చారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి పాతుకు పోయిన వీఆర్వోలకు స్థానచలనం కల్పించేందుకు జూలైలోనే ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. సుమారు 470 మంది ఈ కౌన్సెలింగ్కు హాజరయ్యారు. వీరికి పోస్టింగ్లు ఇవ్వడమే తరువాయి.. ఈసమయంలో హైకోర్టు స్టే ఇవ్వడంతో ఉత్తర్వులు ఇవ్వకుండా నిలుపుదల చేశారు. ప్రస్తుతం వీరందరికి పోస్టింగ్లు ఇచ్చే అవకాశం ఉంది. మరో పక్క పరిపాలనా సౌలభ్యం పేరిట ఇటీవలే పదిమంది తహశీల్దార్లకు కలెక్టర్ స్థానచలనం కల్పించారు. తాజా బదిలీల్లో సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, సెక్షన్ సూపరింటెండెంట్లు, డిప్యూటీ తహశీల్దార్లతో సహా 189 మందికి స్థానచలనం కల్పించే అవకాశాలున్నాయి. రాష్ర్ట స్థాయి గురుపూజోత్సవం, నేషనల్ అథ్లెటిక్స్ మీట్ పూర్తయిన తర్వాత ఈ బదిలీలపై జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
ఇక బదిలీలు
పాత మార్గదర్శకాల ప్రకారమే కసరత్తు ముఖ్యమంత్రి వద్ద ఫైలు,స్వచ్ఛ హైదరాబాద్ తర్వాత ఉత్తర్వులు రెండేళ్ల సర్వీసు నిండితేనే బదిలీకి అర్హులు ఐదేళ్లు ఒకేచోట ఉంటే నిర్బంధ బదిలీ 20 రోజులపాటు కౌన్సెలింగ్కు అవకాశం ఉపాధ్యాయుల బదిలీ, {పమోషన్లు, హేతుబద్ధీకరణ కూడా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైంది. గతంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారమే ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఆర్థిక శాఖ కసరత్తును పూర్తి చేసింది. సంబంధిత ఫైలును ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించింది. ప్రస్తుతం బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతోపాటు తాజా బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా అందులో పొందుపరచింది. దీన్ని ముఖ్యమంత్రి ఆమోదించిన తర్వాత ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో సీఎం కె.చంద్రశేఖర్రావు బిజీగా ఉన్నందున.. గురువారం ఆ కార్యక్రమం ముగిసిన తర్వాతే ఫైలు ముందుకు కదులుతుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ఉద్యోగుల సాధారణ మిగతా 2వ పేజీలో ఠ బదిలీలకు ఏపీ సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఉద్యోగుల్లోనూ ఇదే అంశం చర్చనీయాంశమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013 మేలో దాదాపు అన్ని విభాగాల్లో సాధారణ బదిలీలు జరిగాయి. ఆ తర్వాత బదిలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. సాధారణంగా ప్రతి ఏడాది మే నెలలో సాధారణ బదిలీలకు సర్కారు వెసులుబాటు కల్పిస్తుంది. కానీ గత ఏడాది తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన పరిణామాలతో ఈ ప్రక్రియను చేపట్టలేదు. దీంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని విభాగాల ఉద్యోగుల నుంచి బదిలీలకు సంబంధించిన విజ్ఞప్తులు, దరఖాస్తులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. అధికారవర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈసారి బదిలీలకూ గతంలో ఉన్న నిబంధనలనే పాటిస్తారు. 20 శాతం మించకుండా బదిలీలు కమలనాథన్ కమిటీ పరిధిలో ఉన్న రాష్ట్ర కేడర్, మల్టీ జోనల్ పోస్టులు మినహా.. మిగతా కేడర్ ఉద్యోగులకు సాధారణ బదిలీలతో చిక్కులేమీ ఉండవని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. నిషేధం ఎత్తివేత ఉత్తర్వులు వెలువడ్డాక 20 రోజుల పాటు బదిలీలకు అవకాశం కల్పిస్తారు. పైరవీలు, రాజకీయ జోక్యానికి అవకాశం లేకుండా అన్ని విభాగాల్లో కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు చేపడుతారు. రెండేళ్ల కనీస సర్వీసు ఉన్న ఉద్యోగులే బదిలీలకు అర్హులవుతారు. ఐదేళ్లు ఒకేచోట పని చేసిన ఉద్యోగులను నిర్బంధంగా బదిలీ చేస్తారు. బదిలీ కోరుకునే ప్రతి ఉద్యోగి మూడు ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు సీనియారిటీ జాబితాల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అంగవైకల్యం ఉన్న వారు, భార్యాభర్తలు, ఆరోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కో కేటగిరీలో 20 శాతం మించకుండా ఉద్యోగుల బదిలీలు ఉండాలనే నిబంధనను పాటిస్తారు. వీటికి తోడు పట్టణ ప్రాంతాలు, ప్రాధాన్యత ఉన్న ఫోకల్ ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులను నాన్ ఫోకల్కు బదిలీ చేస్తారు. మారుమూల ప్రాంతాల్లో లాంగ్ స్టాండింగ్గా ఉన్న వారికి న్యాయం జరిగేలా గతంలో ఉన్న మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తారు. మరోవైపు విద్యా శాఖ సిద్ధం చేసిన ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సంబంధించిన ఫైళ్లు కూడా సీఎం దగ్గరే పెండింగ్లో ఉన్నాయి. సాధారణ బదిలీల ఫైలుతోపాటు వీటికి సైతం మోక్షం లభిస్తుందని ఉపాధ్యాయ సంఘాలు ఎదురుచూస్తున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement