హత్య కేసులో రాజేందర్‌రెడ్డికి ఊరట | Rajendra Reddy's relief in murder case | Sakshi
Sakshi News home page

హత్య కేసులో రాజేందర్‌రెడ్డికి ఊరట

Sep 1 2017 1:24 AM | Updated on Sep 12 2017 1:29 AM

గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ 44వ డివిజన్‌ కార్పొరేటర్‌ అనిశెట్టి మురళి హత్య కేసులో నాల్గవ నిందితుడైన జిల్లా కాంగ్రెస్‌ కమిటీ

ముందస్తు బెయిల్‌ మంజూరు  
సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ 44వ డివిజన్‌ కార్పొరేటర్‌ అనిశెట్టి మురళి హత్య కేసులో నాల్గవ నిందితుడైన జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు ఉమ్మడి హైకోర్టు గురువారం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి.సునీల్‌ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. మురళి హత్య కేసులో  ముందస్తు బెయిల్‌ మం జూరు చేయాలంటూ రాజేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీన్ని గురువారం జస్టిస్‌ సునీల్‌ చౌదరి విచారణ జరిపారు. ఈ  కేసులో రాజేందర్‌రెడ్డి పాత్రపై పోలీసులు అదనపు సమాచారా న్ని కోర్టు ముందు ఉంచకపోవడంతో హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. దర్యాప్తులో పోలీసుల కు సహకరించాలని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement