కరోనా భయంతో గృహిణి ఆత్మహత్య

Pregnant Woman Committed Suicide Due To Fear Of Coronavirus At Medak District - Sakshi

తూప్రాన్‌: అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ మహిళ తనకు కరో నా వైరస్‌ సోకుతుందేమోనన్న భయంతో ఆత్మహ త్య చేసుకుంది. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కిష్టయ్య భార్య నాగమణి అలియాస్‌ పద్మ (41) పట్టణంలోని అక్షర స్కూల్‌లో టీచర్‌. కొన్నాళ్లుగా ఆమె టైఫాయిడ్‌ జ్వరంతో బాధపడుతోంది. కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో తనకూ సోకుతుందనే భయంతో ఆదివారం ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు అందినట్టు పోలీసులు చెప్పారు. మృతురాలికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top