తొలి అడుగైనా తడబడ లేదు | political Successful womens | Sakshi
Sakshi News home page

తొలి అడుగైనా తడబడ లేదు

Jul 5 2016 11:47 PM | Updated on Sep 17 2018 5:18 PM

తొలి అడుగైనా తడబడ లేదు - Sakshi

తొలి అడుగైనా తడబడ లేదు

చిన్న వయసులోనే నేను రాజకీయూల్లోకి రావడం ఆనందంగా ఉంది. నా భర్త రాజేష్‌నాయక్ ఎంపీటీసీ సభ్యుడిగా ...

జెడ్పీటీసీ సభ్యులుగా రాణిస్తున్న మహిళలు   
ప్రజాదరణ పొందుతున్న వనితలు
ఇంటి నుంచి రాజకీయ క్షేత్రంలోకి  
పదవి చేపట్టి రెండేళ్లు పూర్తి

 
 
జఫర్‌గఢ్ : చిన్న వయసులోనే నేను రాజకీయూల్లోకి రావడం ఆనందంగా ఉంది. నా భర్త రాజేష్‌నాయక్ ఎంపీటీసీ సభ్యుడిగా రాజకీయూల్లో ఉండడంతో నేను జెడ్పీటీసీ సభ్యురాలిగా పోటీ చేసి గెలుపొందాను. పదవి చేపట్టక ముందు ఎంబీఏ పూర్తి చేసిన. ఏదో ఒక ప్రభుత్వం ఉద్యోగం సంపాదించి ప్రజలకు సేవ చేయాలని అనుకున్నాను. ఊహించకుండా జఫర్‌గఢ్ జెడ్పీటీ సీ స్థానం ఎస్టీ మహిళ రిజర్వ్ కావడంతో నాకు పోటీ  చేసే అవకాశం దక్కింది. రెండేళ్ల పాలనలో గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను దాదాపు పరిష్కరించాను. జెడ్పీటీసీ కోటా కింద మంజూరైన నిధులతో గ్రామాల్లో అదనంగా బోర్లు వేరుుంచాను. అలాగే సీసీ రోడ్లు నిర్మించి, హైమాస్ట్ లైట్లు వేయించాను. జెడ్పీటీసీ నిధులతో పాటు ఇతర నిధులు సుమారు రూ. 90 లక్షలతో ఇప్పటివరకు పలు అభివృద్ధి పనులు చేపట్టాను. రానున్న మూడేళ్లలో మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలందిస్తాను.
 - బానోతు అరుణశ్రీ,  జెడ్పీటీసీ సభ్యురాలు, జఫర్‌గఢ్
 
 
మంచి పేరు తెచ్చుకుంటాను

మడికొండ : జెడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికై రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఎన్నికైన కొత్తలో అధికారులతో మాట్లాడేందుకు కొంచెం భయంగా ఉండేది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామాలకు అవసరమైన పనులు, నిధుల మంజూరు కోసం వారితో నేరుగా మాట్లాడుతున్న. నేను ప్రాతినిధ్యం వహించే హన్మకొండ మండల పరిధిలో నాలుగు గ్రామాలే ఉన్నారుు. అరుుతే గతంలో కంటే ఇంకా వాటిని అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతా. రానున్న మూడేళ్లలో ప్రజలందరికీ మౌలిక సదుపాయూలు కల్పించి మంచి పేరు తెచ్చుకుంటాను.
 
 
భర్త ప్రోత్సాహంతో

రఘునాథపల్లి : నేను జెడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికై రెండేళ్లు పూర్తరుుంది. ఈ రెండేళ్ల పాలనలో ఇప్పటివరకు మండల పరిధిలో రూ. 1.20 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాను. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పటికీ మామయ్య గోపాల్‌నాయక్ సలహాలు, సూచనలు, భర్త తిరుమల్‌నాయక్ ప్రోత్సాహంతో ప్రజలకు నిరంతరం సేవ చేస్తున్నా. మండలంలో తాగునీటి ఎద్దడి నివారణకు ఇప్పటికే 49 బోర్లు వేయించాను. సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ. 55 లక్షలు మంజూరు చేయూలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాను. గతంలో మంగళిబండతండా, మేకలగట్టు, ఖిలాషాపూర్‌లో చెరువులు నింపేందుకు ఆయా గ్రామాల రైతులతో కలిసి కెనాల్ పూడికతీత పనులను జేసీబీ సాయంతో స్వచ్ఛందంగా తవ్వించాను. ఈ ఏడాది గోదావరి జలాలతో చెరువులు నిం పేందుకు కృషి చేస్తాను.  రానున్న మూడేళ్లలో మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తాను.  - బానోతు శారద, జెడ్పీటీసీ సభ్యురాలు, రఘునాథపల్లి
 
 
రెండేళ్ల పాలనలో ఆత్మ సంతృప్తి

జనగామ : స్థానిక సంస్థల ఎన్నికల్లో మా జెడ్పీటీసీ స్థా నం బీసీ మహిళకు రిజ ర్వేషన్ అయింది. నా భర్త సాగర్ ప్రోత్సాహంతో మొదటిసారి గా రాజకీయాల్లోకి వచ్చాను. ఇంటర్ సీఈసీ పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువులకు వెళ్లే సమయంలో రాజకీయ అవకా శం వచ్చింది. జెడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన రెండేళ్లలో మండలంలో రూ. 19 లక్షలతో తాగునీటి ఎద్దడి నివారణకు 20 బోర్లు వేయించాను. కొన్నె నుంచి నర్సింహాస్వామి ఆల యం వరకు రూ. 8 లక్షలతో గ్రావెల్, అదే గ్రామంలో రూ.5 లక్షలతో తాగునీటి పైపులైన్, రాంచంద్రాపూర్ నుంచి గంగాపూర్‌కు రూ.2 లక్షలతో గ్రావెల్, కేశిరెడ్డిపల్లి పాఠశాలలో తాగునీటి బోరు నిర్మాణం చేయించాను. మూడేళ్లలో మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. ఈ రెండేళ్ల పాలన నాకు ఆత్మ సంతృప్తి మిగిల్చింది. - వేముల స్వప్న, జెడ్పీటీసీ సభ్యురాలు, బచ్చన్నపేట
 
 
నిరంతరం కష్టపడుతున్నా

 దుగ్గొండి : నేను ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాను. ఓ వైపు గృహిణిగా, మహిళా రైతుగా కుటుంబ బాధ్యతలు మోస్తూనే.. మరో వైపు ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవలందిస్తున్నాను. నా భర్తకు ఉన్న మంచితనం, పార్టీ కార్యకర్తల నిరంతర శ్రమనే నన్ను జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలిపించారుు. పదవికి ఎన్నికైన రెండేళ్లలో గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టాను. రూ. 10 లక్షలతో తాగునీటి పైపులైన్లు వేరుుంచాను. అలాగే రూ. 10 లక్షలతో మండలంలోని రేకంపల్లి నుంచి తిమ్మంపేటకు ఫార్మేషన్ రోడ్డు వేయించాను. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా వారికి అందుబాటులో ఉండి పనిచేస్తున్నా. శుభ, అశుభ కార్యాలకు అన్నింటికి హాజరవుతున్నా. ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని మహిళలను చైతన్య పరుస్తున్నా. నన్ను నమ్మి ఓటేసిన ప్రజల రుణం తీర్చుకునేందుకు నిరంతరం కష్టపడుతున్నా. ప్రభుత్వం జెడ్పీటీసీలకు మరిన్ని నిధులు మంజూరు చేయూలి.  - సుకినె రజిత, జెడ్పీటీసీ సభ్యురాలు, దుగ్గొండి
 

అంకితభావంతో పనిచేస్తా
కురవి : నేను సాధారణ గృహిణిని. అందివచ్చిన రిజర్వేషన్‌తో జెడ్పీటీ సీ సభ్యురాలిగా పోటీచేసి గెలుపొందాను. ప్రభుత్వం జెడ్పీటీసీ కోటా కింద మంజూరు చేసిన నిధులతో ఇప్పటివరకు మండలంలో తాగునీటి సమస్యను పరిష్కరించాను. గిరిజన తండాలకు, మారుమూల గ్రామాలకు ఫార్మేషన్ రోడ్లను కూడా ఏర్పాటు చేశాను. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో కురవి గ్రామాన్ని దత్తత తీసుకున్నాను. అలాగే రూ. 15 లక్షలతో కురవిలో తాగునీటి ఇబ్బందులు తొలగించాను. ఈ ఏడాది వేసవి కాలంలో అన్ని గ్రామాల ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించాం. మరో మూడేళ్లలో వచ్చే నిధులతో అన్ని గ్రామా లను అభివృద్ధి చేసేందుకు అంకితభావంతో పనిచేస్తా.  - కొణతం కవిత, జెడ్పీటీసీ సభ్యురాలు, కురవి
 
 
జవాబుదారీగా ఉంటున్నా

డోర్నకల్ : గతంలో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకున్నప్పటికీ అందివచ్చిన రిజర్వేషన్‌తో జెడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యూను. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మొదట్లో కొంచెం భయంగా ఉండేది. నా భర్త సహకారంతో ఇప్పుడు అన్ని కార్యక్రమాల్లో ధైర్యంగా పాల్గొంటూ మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందిస్తున్నా. నిధుల కొరతతో రెండేళ్లలో ఆశించిన స్థారుులో పనులు చేపట్టలేదు. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ తరచూ పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నా. రానున్న మూడేళ్లలో అన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల, గురుకుల పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తాను. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ మం డల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తాను. -కేశబోయిన స్వరూప, జెడ్పీటీసీ సభ్యురాలు, డోర్నకల్
 
 
ప్రజల మన్ననలు పొందుతా

గీసుకొండ : జెడ్పీటీసీ సభ్యురాలిగా పదవి చేపట్టడం సంతోషంగా ఉంది. అరుుతే ప్రజాప్రతినిధిగా ఎన్నికై రెండు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ప్రభుత్వం మాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం లేదు. గతంలో మంజూరైన రూ. 30 లక్షల నిధులతోనే మండల పరిధిలోని గ్రామాల్లో కొన్ని పనులు చేపట్టాను. కొత్తగా నిధుల కేటాయింపు లేకపోవడంతో గ్రామాల్లోకి వెళ్లినప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోతున్నా. నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా పది నెలల నుంచి వేతనాలు రావడం లేదు. ప్రభుత్వం జెడ్పీటీసీ సభ్యుల కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలి. మం డలంలో పారదర్శక పాలన చేపట్టి ప్రజల మన్ననలు పొందుతా.
 
 
బంగారు తెలంగాణకు కృషి

పర్వతగిరి : నేను జెడ్పీటీ సీ సభ్యురాలిగా ఎన్నిక కావడం ఆనందంగా ఉంది. ప్రత్యక్ష రాజకీయాల్లో తిరుగుతుండడంతో ప్రజల సమస్యలు చాలా తెలుస్తున్నాయి. ఇప్పటివరకు నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించాను. రెండేళ్లలో రూ. 30 లక్షలతో 42 బో ర్లు వేయించాను. మూడెత్తుల తండా నుంచి శ్రీనగర్ వరకు రూ. 5లక్షలతో గ్రావెల్, కొంకపాకలో రూ. 5 లక్షలతో గ్రావె ల్, గోపనపల్లిలో రూ. 5లక్షలతో గ్రావెల్ రోడ్లు వేయించాను. బూర్గుమళ్ల, కొంకపాక, చౌటపల్లి గ్రామాల్లో రూ. 4 లక్షల చొ ప్పున హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయించాను. కొంకపాక పాఠశాలలో రూ.2 లక్షలతో మినీ వాటర్‌ట్యాంకు, షెడ్డు నిర్మాణ పనులను చేపడుతున్నాం. కల్లెడ, చౌటపల్లి, కొంకపాకలో రూ. 6 లక్షలతో పైప్‌లైన్ ఏర్పాటు చేయించాను. రాను న్న మూడేళ్లలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతా. బంగా రు తెలంగాణ సాధనకు నావంతు కృషి చేస్తా.  - మాదాసి శైలజ, జెడ్పీటీసీ సభ్యురాలు, పర్వతగిరి
 
 
ప్రజా సేవ ఆనందంగా ఉంది

జనగామ : నేను డిప్లమా (డీసీసీపీ) పూర్తి చేసిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాను. నా భర్త మల్లేశం స్ఫూర్తితో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. తొలిసారిగా జెడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నా. నన్ను గెలిపించిన మండల ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను. గత వేసవిలో మండలంలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నా. జెడ్పీటీసీ కోటా కింద ఇప్పటివరకు మంజూరైన నిధులతో మండలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాను. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందిస్తుండడంతో ఆనందంగా ఉంది. - సుంకరి సరిత, జెడ్పీటీసీ సభ్యురాలు, చేర్యాల
 

మొదటి సారి రాజకీయూల్లోకి
సంగెం : నేను తొలిసారిగా రాజకీయూల్లోకి వచ్చాను. జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచిన మొదటి సంవత్సరంలో వచ్చిన నిధులతో మండల పరిధిలోని గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాను. ఈ ఏడాది మాకు నిధులు మంజూరు కాకపోవడంతో ప్రజలకు వ్యక్తిగతంగా ఎలాంటి హామీ ఇవ్వలేకపోతున్నాను. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందజేసేందుకు కృషి చేస్తున్నాను. రానున్న రోజుల్లో ప్రభుత్వం మంజూరు చేసే నిధులతో మండలంలోని మారుమూల గ్రామాలు, తండాల్లో రోడ్లు, తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా. మొత్తంగా ఐదేళ్ల పాలనలో మంచి పనులు చేసి ప్రజల అశీస్సులు పొందుతాను. నిత్యం ప్రజలతో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా.  -గుగులోతు వీరమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు, సంగెం
 
 
పదవికి న్యాయం చేస్తున్నా

ఏటూరునాగారం : జెడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికై తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చాను. అన్ని వర్గాల ప్రజల సహకారంతో రెండేళ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాను. మండల కేంద్రంలోని నాలుగో వార్డులో సీసీ రోడ్డు, జిల్లా పరిషత్ పాఠశాలలో పైపులైన్, బోరు నిర్మాణం చేపట్టాను. అలాగే మండలంలోని గోగుపల్లి, రాజన్నపేట, గంగూడెం, కొండాయి, రామన్నగూడెం, రాంనగర్‌తోపాటు మరికొన్నింటిలో 50 బోర్లు ఏర్పాటు చేయించాను. రామన్నగూడెం జిల్లా పరిషత్ పాఠశాలలో తాగునీటి అవసరాల కోసం పైపులైన్, బోరు నిర్మాణం చేపట్టాను. స్థానిక దళిత కాలనీలోని అంగన్‌వాడీ భవనానికి, శివాపురంలో ప్రాథమిక పాఠశాలకు ప్రహారీలు ఏర్పాటు చేయించాను. రానున్న మూడేళ్లలో ప్రభుత్వం మంజూరు చేసే నిధులతో మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. ప్రజలు నన్ను నమ్మి గెలిపించినందుకు పదవికి న్యాయం చేస్తున్నా. - ఎండీ వలియాబీ, జెడ్పీటీసీ సభ్యురాలు, ఏటూరునాగారం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement