పోలీసుల సమక్షంలో ప్రాణదీప్‌ - సౌజన్య పెళ్లి | Police Pickets Couple To Get Married In Nizamabad | Sakshi
Sakshi News home page

Jun 22 2018 4:49 PM | Updated on Aug 21 2018 7:17 PM

Police Pickets Couple To Get Married In Nizamabad - Sakshi

ఆర్యసమాజ్‌లో ఒక్కటైన ప్రాణదీప్‌, సౌజన్య

సాక్షి, నిజామాబాద్‌ : జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన ప్రేమజంట పెళ్లి వ్యవహారం పోలీసుల జోక్యంతో సుఖాంతమైంది. బుధవారం ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుందామనుకున్న ప్రాణదీప్‌, సౌజన్యలను యువతి కుంటుంబ సభ్యులు విడదీసిన సంగతి తెలిసిందే. పెళ్లి పీటలపై నుంచి తనకు కాబోయే భార్యను ఎత్తుకెళ్లారని యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతీ, యువకులు మేజర్లు కావడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సవాలుగా తీసుకున్నారు.

ఏసీపీ సుదర్శన్‌ ఆధ్వర్యంలో సౌజన్యకు కౌన్సిలింగ్‌ చేయగా.. ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెపింది. దీంతో వారిద్దరినీ టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసుల సెక్యూరిటీ మధ్య శుక్రవారం పట్టణంలోని ఆర్యసమాజ్‌లో స్నేహితుల సమక్షంలో ప్రాణదీప్‌, సౌజన్య వివాహం జరిగింది. కాగా, ఇష్టపడే వివాహం చేసుకున్నానని.. తనపై ఎవరి ఒత్తిడి లేదని యువతి కోర్టులో చెప్పడంతో పోలీసులు సౌజన్య కుంటుంబ సభ్యులపై కిడ్నాప్‌ కేసు సమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement